Sunday, November 5, 2017

బాల భావన శతకము. 31 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
31) పుస్తకాలు పట్టి కుస్తీలు పట్టుటే  నిత్యకృత్యమాయె. నిదుర లేక
    మనసు గాడి తప్పి, మరతుము. కనరేలపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము పుస్తకాలను చేతితో పట్టుకొని వాటితో కుస్తీలు పట్టుతూ చదవడమే మాకు నిత్యకృత్యమైపోయింది. ఈ కారణం గాకు నిద్దురపోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. తీరని నిద్దుర మత్తుతో మనసు గాడి తప్పుతోందిచదివినది గుర్తుండటం లేదు. ఈ విషయం మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
జైహింద్.

No comments: