Monday, November 27, 2017

బాల భావన. 52వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
బాల భావన. 52వ పద్యము.
52) తల్లిదండ్రులెపుడు పిల్లల వృద్ధినే   -  కోరుచుంద్రు సుఖము ధారవోసి.
     పెంచి పెద్ద చేసి, మంచినే చూపుడీ.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి తండ్రులు తమ సుఖమును ధారవోసిమరీ తమ పిల్లల యొక్క అభివృద్ధినే కోరుకొనుచుందురు. అట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నప్పుడు వారిలో మంచి గుణములనే అభివృద్ధి చేయవలెను.
జైహింద్.

No comments: