Monday, November 13, 2017

బాల భావన శతకము. 39 వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
39) చదువరాని చెత్త చదువగా చదువగా  మనసు ఖిలము చెంది మైల పడును.
     మైల పడిన మదిని మముఁ జూడ మనసౌనెపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చదువరాని వాటిని చదువు చుందురు. అట్లు చదువుట వలన మనసు చెడి మలినమునొందును. అట్టి మలినమైన మనసుతో మమ్ము చూచుటకు వారికి ఏ విధముగా మనసు కలుగును? సిగ్గనిపించదా?
జైహింద్.

No comments: