Tuesday, October 28, 2008

ప్రాచీన సంస్కృతి మేలిమి బంగారం. 1

ప్రాచీన సంస్కృతి మేలిమి బంగారం. 1

శ్రీమన్మహా దేవుడైన పరమాత్మ సృష్టిలో గడచిన కాలం అనంతమైనది. ఈ అనంత కాలంలో అనంత విశ్వంలో సత్ శాస్వితం. అసత్ అశాశ్వితం. ఈ సత్ స్వరూపాన్ని మన పురాణాలు ఇతిహాసాలు, వేదాలు, ఇంకా అనంతమైన గ్రంథ రాజము మన ప్రాచీన సంస్కృతి పేర తెలియ జేస్తున్నాయి. మానవ మనుగడకు ఆసూక్తులే సన్మార్గ దర్శకాలు. వాటిని మనం మననం చేసుకోవడమే కాకుండా ముందు తరాల వారికి కూడా అందించాలి. వాటిని పొడి పొడి మాటలతో చెప్పినచో అవి గాలిలో కలిసిపోతాయి. మంచి మాటలెందరో చెప్పారు. ఐనా వేమన పద్య రూపంలో నున్న నీతులు అందరి నోళ్ళలోను నానుతున్న మాట మనకు తెలియనిది కాదు. అందుకే మనం శ్లోకాల రూపంలోనూ, పద్యాల రూపంలోను కంఠస్థం చేసి అనర్గళంగా సమయానుకూలంగా ఎక్కడపడితే అక్కడ చెప్పేలాగ సాధన చేయాలి. ఇట్టి సాధన చేసేవారికుపకరిస్తుందనే ఆశతో కొన్నైనా మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.ఈ ప్రయత్నం సహృదయుల మన్ననను తప్పక పొంద గలుగుతుందనుకొంటున్నాను. ఇక విషయానికి వెళ్దాము.
శ్లోకః :-ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----మహాభారతం.--అరణ్య పర్వం---29 వ శ్లోకం.
గీ:-
పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా! య
ని యను దినము ప్రశ్నంచుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.

Sunday, October 26, 2008

పద్యాల్లో ఉపయోగించు ప్రాసలు

"ఛందో బద్ధ పద్య రచనకు ఉపకరించు ప్రాసలు
ఇంత వరకు మనం పద్యములలో ప్రయోగింప దగిన యతులను గూర్చి తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ప్రాసలను గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా మరి?

అసలు ప్రాస అంటే ఏమిటి ?
పద్య పాదమునందలి ప్రథమాక్షరాన్ని యతి అంటారని ముందుగా తెలుసుకొన్నాం కదా! రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యంలో మొదటి పాదంలో యే అక్షరం రెండవాక్షరంగా ప్రాస స్ఠానంలో ఉంచారో ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోనూ అదే అక్షరం ప్రయోగించాలి.
ప్రాసాక్షరంలో అచ్ సామ్యమక్కరలేదు.
ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు అన్ని పాదాల లోను ఉండాలి.

ఇక ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.
1) అర్థ బిందు సమప్రాస:-
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని పాదాలలో నుంచుట. " వీ ( క - తా ( కి "

2) పూర్ణ బిందు సమప్రాస :-
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రాసాక్షరం బిందు పూర్వకమే అవాలి. " పొందు - బృంద "

3)ఖండాఖండ ప్రాస:-
అర సున్న కలిగి యున్న ప్రాసాక్షరంతో అరసున్న లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."బో( టి - పాట "

4) సమ్యుక్తాక్షర ప్రాస:-
ఏ సమ్యుక్త హల్లు ప్రాస స్థానంలో ఉంటుందో అదే సమ్యుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రయోగించాలి. " అక్ష - కుక్షి "

5) సమ్యుతాసమ్యుత ప్రాస :-
రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

6) లఘు ద్విత్వ ప్రాస :-
సమ్యుక్త పూర్వాక్షరము లఘువయితే మిగిలిన అన్ని పాదాలలోనూ అటులనే రావాలి. "విద్రుచు - అద్రువ"

7)వికల్ప ప్రాస :-
అనునాసిక వికల్ప సంధ్యక్షరములకు ప్రాస. " దిఙ్మహిత - యుగ్మ "

8) ఉభయ ప్రాస :-
" న - ణ " లకు,
" స - ష " లకు, ప్రాస. " ప్రాణ - దాన " "వసుధ - విషమ "

9) అను నాసిక ప్రాస:-
భ/ క్తిమ్ముర < భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ముర > తో - తమ్ములు. కు ప్రాస.

10) ప్రాస మైత్రి ప్రాస :-
" మ్మ - ం బ " లకు ప్రాస చెల్లును.

11) ప్రాస వైరము :-
" ర - ఱ ' లకు ప్రాస పనికి రాదు.

12) స్వ వర్గజ ప్రాస :-
" థ - ధ " లకు,ప్రాస చెల్లును.
" ద - ధ " లకు ప్రాస చెల్లును.

13) ఋ ప్రాస :-
" ఋ - ర " లకు ప్రాస చెల్లును. ఉ:- " ఆఋషి - చీరలు "

14) లఘు యకార ప్రాస :-
" ఆయజు < ఆ + అజు > - శాయికి "

15) అ భేద ప్రాస :-
" ల -ళ " లకు ప్రాసచెల్లును.
" ల - డ " లకు ప్రాస.చెల్లును.

16) సంధి గత ప్రాస :-
వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము.
మొదలగునవి.

తెలుసుకొన్నాం కదా ! ఇంకెందుకు ఆలస్యం? పద్యాలు వ్రాసే ప్రయత్నం చెద్దామా మరి ?
జైహింద్.

పద్యాల్లో ఉపయోగించు ప్రాసలు

"ఛందో బద్ధ పద్య రచనకు ఉపకరించు ప్రాసలు
ఇంత వరకు మనం పద్యములలో ప్రయోగింప దగిన యతులను గూర్చి తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ప్రాసలను గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా మరి?

అసలు ప్రాస అంటే ఏమిటి ?
పద్య పాదమునందలి ప్రథమాక్షరాన్ని యతి అంటారని ముందుగా తెలుసుకొన్నాం కదా! రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యంలో మొదటి పాదంలో యే అక్షరం రెండవాక్షరంగా ప్రాస స్ఠానంలో ఉంచారో ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోనూ అదే అక్షరం ప్రయోగించాలి.
ప్రాసాక్షరంలో అచ్ సామ్యమక్కరలేదు.
ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు అన్ని పాదాల లోను ఉండాలి.

ఇక ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.
1) అర్థ బిందు సమప్రాస:-
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని పాదాలలో నుంచుట. " వీ ( క - తా ( కి "

2) పూర్ణ బిందు సమప్రాస :-
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రాసాక్షరం బిందు పూర్వకమే అవాలి. " పొందు - బృంద "

3)ఖండాఖండ ప్రాస:-
అర సున్న కలిగి యున్న ప్రాసాక్షరంతో అరసున్న లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."బో( టి - పాట "

4) సమ్యుక్తాక్షర ప్రాస:-
ఏ సమ్యుక్త హల్లు ప్రాస స్థానంలో ఉంటుందో అదే సమ్యుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రయోగించాలి. " అక్ష - కుక్షి "

5) సమ్యుతాసమ్యుత ప్రాస :-
రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

6) లఘు ద్విత్వ ప్రాస :-
సమ్యుక్త పూర్వాక్షరము లఘువయితే మిగిలిన అన్ని పాదాలలోనూ అటులనే రావాలి. "విద్రుచు - అద్రువ"

7)వికల్ప ప్రాస :-
అనునాసిక వికల్ప సంధ్యక్షరములకు ప్రాస. " దిఙ్మహిత - యుగ్మ "

8) ఉభయ ప్రాస :-
" న - ణ " లకు,
" స - ష " లకు, ప్రాస. " ప్రాణ - దాన " "వసుధ - విషమ "

9) అను నాసిక ప్రాస:-
భ/ క్తిమ్ముర < భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ముర > తో - తమ్ములు. కు ప్రాస.

10) ప్రాస మైత్రి ప్రాస :-
" మ్మ - ం బ " లకు ప్రాస చెల్లును.

11) ప్రాస వైరము :-
" ర - ఱ ' లకు ప్రాస పనికి రాదు.

12) స్వ వర్గజ ప్రాస :-
" థ - ధ " లకు,ప్రాస చెల్లును.
" ద - ధ " లకు ప్రాస చెల్లును.

13) ఋ ప్రాస :-
" ఋ - ర " లకు ప్రాస చెల్లును. ఉ:- " ఆఋషి - చీరలు "

14) లఘు యకార ప్రాస :-
" ఆయజు < ఆ + అజు > - శాయికి "

15) అ భేద ప్రాస :-
" ల -ళ " లకు ప్రాసచెల్లును.
" ల - డ " లకు ప్రాస.చెల్లును.

16) సంధి గత ప్రాస :-
వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము.
మొదలగునవి.

తెలుసుకొన్నాం కదా ! ఇంకెందుకు ఆలస్యం? పద్యాలు వ్రాసే ప్రయత్నం చెద్దామా మరి ? జైహింద్.

Friday, October 24, 2008

యతులను గూర్చి తెలుసుకొందాం ౨ వ భాగం

యతుల కోసం మతులు పోకోట్టుకోవడంఎందుకు మనం? నేర్సుకొందాంరండి. ౨ వ భాగము.

యతుల విషయాలు క్రిందటి సారి కొన్ని తెలుసుకొన్నాంకదా! ఇప్పుడు మరికొన్ని తెలుసుకొందామా?
వ్యంజన యతులు :-
1) వర్గజ యతులు :- కవర్గాదులలో పంచమాక్షరం మినహ మిగిలిన 4 హల్లులూలకూ పరస్పరం యతి చెల్లును.
క. ఖ. గ. ఘ. { క } వర్గజ యతి
చ. ఛ. జ. ఝ. { చ } వర్గజ యతి.
ట. ఠ. డ. ఢ. { ట } వర్గజ యతి
త. థ. ద. ధ. { త } వర్గజ యతి.
ప. ఫ. బ. భ. { ప } వర్గజ యతి.
ఏ వర్గక్షరములకా వర్గాక్షరములు తమలో తాము యతిచెల్లును.
2) బిందు యతి :-
" ఙ " తో > ంక. ంఖ. ంగ. ంఘ.
" ఞ " తో > ంచ. ంఛ. ంజ. ంఝ.
" ణ " తో >ంట. ంఠ. ండ. ంఢ.
" న " తో > ంత. ంథ. ంద. ంధ.
"మ " తో >ంప.ంఫ. ంబ. ంభ. లు బిందు యతిపేరుతో పరస్పరము చెల్లును.
3) తద్ భవ వ్యాజ యతి:- " జ్ఞ - న - ణ " లు పరస్పరము చెల్లును.
4) విశేష యతి:- " జ్ఞ " - క - ఖ - గ - ఘ. లు పరస్పరము చెల్లును.
5) అనుస్వార సంబంధ యతి :- " ంట - ంఠ - ండ - ంఢ - ంత - ంథ - ంద - ంధ -లు పరస్పరము చెల్లును.
6) అను నాసికాక్షర యతి :-
" న " తో > ంట - ంఠ - ండ - ంఢ. చెల్లును.
" ణ " తో > ంత - ంథ - ంద - ంధ. చెల్లును.
7) ము కార యతి :- "పు - ఫు - బు - భు - ము ' లు చెల్లును.
8) మ వర్ణ యతి :- " మ - ం య - ం ర - ం ల - ం వ - ం శ - ం ష - ం స - ం హ " లు చెల్లును.
9) సరస యతి :-
" అ - య - హ " లు చెల్లును.
" చ - ఛ - జ - ఝ - శ - ష - స " లు చెల్లును.
" న - ణ " లు చెల్లును.
10) అ భేద యతి :-
" వ - బ " లు చెల్లును.
" ల - ళ " లు చెల్లును.
" ల - డ " లు చెల్లును.
11) అ భేద వర్గ యతి :- " ప - ఫ - బ - భ - వ " లు చెల్లును.
12) సం యుక్త యతి :- " క్ష్మ " వంటి సం యుక్త హల్లులో గల " క - ష - మ "లలో యేదో వొక దానికి యతి వేయ జెల్లును.
13) అంత్యోష్మ సంధి యతి :- " వాక్ + హరి = వాగ్ఘరి " ఇందు " క ' తో గాని " హ " తో గాని యతి వేయ జెల్లును.
14) వికల్ప యతి :- " సత్ + మతి = సన్మతి. " ఇందు " త " తో గాని " న " తో గాని యతి వేయ జెల్లును.
పైన వివరించినవన్నీ పరస్పరమూ చెల్లునని గ్రహింప గలము.
ఇప్పటికే మీరు బాగ అలిసిపోయినట్లున్నారు. మరికొన్ని యతులను గూర్చి మరొకనాడు కలుసుకొన్నాప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. జైహింద్


Wednesday, October 22, 2008

యతులను గూర్చి మతులెందుకు పోకొట్టుకోవడం? నేర్చుకుందాం రండి.

ఆంధ్ర భాషకు అమర భాషకన్నా అమృత భాషగా కీర్తి కారకమైనది అనితర దుర్లభమైన ఛందో బద్ధ సాహితీ సంపత్తియే. మనం సాధించ దల్చుకొంటే ఆఛందస్సు, మనకు దుర్లభమైనదేమీ కాదు. సులభ సాధ్యమే.ఐతే మనకది కరతలామలకం కావాలంటేమాత్రం కొంచెం దృష్టి పెట్టి నేర్చుకొంటే క్షణాలమీద నేర్చుకో వచ్చు. మీరు చాలా వుత్సాహంగా నేర్చుకోవాలనుకొంటున్నారు కాబట్టి మీకు గుర్తుండే విధంగా యతులను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
మనం హుషారుగా ఒక పద్యం వ్రాసి ఏపండితునికో చూపిస్తే......... యిక్కడ ప్రాస తప్పింది.... అక్కడ యతి తప్పింది... అనేసరికి మన వుత్సాహం కాస్తా నీరు కారిపోయి యిహ జీవితంలో పద్యాల జోలికి పోకూడదనే స్థాయికి మనకు కలిగిన నిస్పృహ మనల్ని చేరుస్తుంది. అంతే. పుస్తకం మూసెస్తాం. అంత నిస్పృహ చెందనవసరం లేదు.ముందుగా యతులను చూడండి.
యతి అంటే విచ్ఛేదము అని అర్థం. " యతిర్విచ్చేద సంజ్ఞకః " .
మొదటి అక్షరానికి యతి అని పేరు.
మొదటి అక్షరం యే అక్షరం వుంచామో అదే అక్షరం కాని, లేదా దాని మిత్రాక్షరం కాని యతిస్థానంలో వాడాలి.
ఇప్పుడు అక్షరం అనే పదంలో చిన్న విషయం తేలుసుకోవాలి.
అచ్చులతో కలిస్తేనే హల్లైనా సమ్యుక్త హల్లైనా పలుక బడుతుంది.
అంటే యతి స్థానంలో 1.అచ్చూ 2. హల్లూ ఉన్న మాట మనం మరువ కూడదు.
యతి నియమం అంటే మోదటి అక్షరంలో యే హల్లు., ఏ అచ్చు వాడామో ఆ అచ్చుతో గాని లేదా ఆచ్చుకు మిత్రాక్షరమైన అచ్చుతో గాని కూడిన హల్లుకుగాని లేదా దాని మిత్ర హల్లుకు గాని యతి వేయాలని గుర్తుంచుకోవాలి.
మనకొక సందేహం వస్తుంది. ఏ అచ్చుకి ఏఅచ్చు మైత్రి కలిగివుంది. ఏ హల్లుకి యా హల్లు మైత్రి కలిగి వుంది అని.
అందుకే ముందుగా అచ్చులకు గల మైత్రిని తెలుసుకుందాం.వీటినే స్వర యతులు అంటారు.
స్వర యతులు:-
1) స్వరమైత్రి వళి;- అ ఆ ఐ ఔ . {ఫ్రెండ్స్}
ఇ ఈ ఋ ౠ ఎ ఏ {ఫ్రెండ్స్}
ఉ ఊ ఒ ఓ {ఫ్రెండ్స్}
పైన తెలిపిన క్రమంలోనే అచ్చులకు యతి మైత్రి చెల్లుతుంది. హల్లులలో వుండే అచ్చులు పై క్రమంలోనే ప్రయోగించాలి
2) స్వర ప్రధాన వళి:- అచ్చులకు సంధి అయిన చోట పర పదంలోని మొదటి అచ్{వంశ్+అ = వంశ + అబ్ధి} దీనిలో అబ్ధి అనే పదంలోని " అ " అనే అచ్చుకే యతి వేయాలి.
3) లుప్త విసర్గక స్వర వళి;- తమః + అర్క > తమోర్క. ఇలాగ విసర్గ మీద అకారము ఓ కారంగా మారిపోతున్నప్పుడు అందులోగల " అ " కారానికే యతి వేయాలి.
4) ఋ వళి:- "ఋ" తో గాని, ఋ నే వట్రసుడిగా కలిగి యున్న హల్లులోగల వట్రసుడితో గాని రి రీ రె రే లకు యతి కుదురుతుంది.
5) ఋత్వ సంబంధ వళి:- వట్రసుడి తో ఇ ఈ ఋ ౠ ఎ ఏ లకు యతి చెల్లు తుంది
6) ఋత్వ సామ్య వళి:-వట్రసుడి గలిగిన హల్లులు అవి యేవైనాసరే హల్ల్ సామ్యంతో నిమిత్తం లేకుండా వట్రసుడులు కలిగివుంటే చా;లు యతి చెల్లును.
7) వృద్ధి వళి:- అ కరమునకు ఎ ఏ ఐ లు పరమైన ఐ కారమూ, ఒ ఓ ఔ లు పరమైన ఔ కారమూ సంధిలో వచ్చిన వృద్ధి సంధి అంటారుకదా! అలాంటి చోట సంధి కాక ముందున్న అచ్చుతోనైనా, సంధి అయిన తరువాత వచ్చిన అచ్చుతోనైనా యతి వేయ వచ్చును.
ఇవే స్వర యతులు. వ్యంజనాక్షర యతుల్ని గూర్చి మరొకమారు కలుసుకొన్నప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. జైహింద్.

ఒక కంద పద్యం లో ఒకటా రెండా మూడా కాదు, నాలుగు కంద పద్యాలు.

కందంలో కందం, అందులోనే మరో కందం, మరో కందం కూడా. చూడాలనుందా? ఐతే యీ క్రింది పద్యాన్ని గమనించండి.
క:- శంకర! ఉమాధిపా! వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా!
సంకటము బాపి, కృప గన
నింకన్ శరణంబు వేడ నేలవు. భరమా? ఇది 1 వ కందపద్యము.

క:-కరుణార్ద్ర హృదయ! అభవా!
జిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్
శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా! ఇది 2 వ కనద పద్యము.

క:-సంకటము బాపి కృపగన
నింకన్ శరనంబు వేడ నేలవు. భరమా?
శంకర్! ఉమాధిప!వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా! ఇది 3 వ కంద పద్యము.

క:-శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా!
కరుణార్ద్ర హ్ర్దయ! అభవా!
గిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్. ఇది 4 వ కంద పద్యము.

చూచారుకదా! తమాషాగాలేదూ? ప్రయత్నం చేయాలేకాని బోలెడన్ని తమాషాలు చేయవచ్చు. ఐతే మీ వుత్సాహాన్ని తెలుసుకొన్న తరువాతే మరి కొన్ని విషయాల్ని గూర్చి తెలియ జేసే ప్రయత్నం చేయగలను. జై హింద్.

Sunday, October 5, 2008

అంతర్జాల భువన విజయము

ప్రియ సాహితీ బంధువులారా! అంతర్ జాల భువన విజయము నిర్వహణలో కృతకృత్యులయినందుకు మీ అందరికీ నా అభినందనలు.నిర్వహణ దీక్షా దక్షులయిన రాయల వారికి కూడా కృతకృత్యులయినందుకు నా హృదయ పూర్వక అభినందనలు. మీరంతా నాపద్యాలకు చక్కని వ్యాఖ్యానం చేసి ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు.
సీ:-కృష్ణ రాయలు పద్య తృష్ణ తోడ కవుల - నష్టా దశా2ధిక మలర నుంచి,
భువన మంతయు సభా భవన మట్టుల జేసి - పెద్దనాదులు తమ ప్రతిభ జూప
పద్యము లెన్నియో హృద్యమౌ రీతిలో - పలుకు నట్టుల జేసి, వెలయ జేసి
భువన విజయమును కవన విజయమన - కవులకు సన్నుతి కలుగ జేసి.
గీ:-ఆంధ్ర సాహితీ వేత్తలు హర్ష మునను - పొంగ, భువన మంతర్జాల భువనవిజయ
కవుల కల్పనా పటిమను కాంక్ష తోడ - చూడ, జేసిరి . తానె మన తోడ నుండి.

చ:- కవులను కోరుచుంటి. తమ కమ్మని సత్ కవితా ప్రవాహమున్
భువిని ప్రశస్థమౌనటుల ముచ్చటతో ప్రవహింప జేయుచున్
భువనమె కృష్ణ రాయకవి పుణ్య ప్రదంబగు కొల్వుగా, సభా
భవనమునమునందు సత్ కవిగ పన్నుగ మీరు రహింప. నెల్లెడన్.
సజ్జన విధేయుడు
చింతా రామ కృష్ణా రావు.
{ ఆంధ్రామృతం బ్లాగ్}

Thursday, September 11, 2008

వర్దిపర్తి కోనకవి.

వర్దిపర్తి కొనమరాట్ కవీన్ద్రుదుడి సర్వసిద్ది గ్రామం.నెల్లూరు నెరజాణల కొంటె ప్రశ్నలకు తుంటరి సమాధానం చెప్పిన ఉద్దనులు ౧౯ వ శతాబ్దంనాటి సర్వసిద్ధి వాస్తవ్యులు. కవీంద్రుని సమాధానాలకి అచ్చెరువొందిన ఆ కాన్తామనులు ఒక మెట్టు దిగి, " సర్వసిద్ధి సరసులకు నెల్లూరు నేరజాణలు దాసోహం " అనిరి. అంతటి మహాకవి అంటే కాదు మహిమాన్విత కవి కూడా. ఈ కవి వేంకటేశ్వరోపాఖ్యానం, మహాలక్ష్మీ పరిణయం, మున్నగు గ్రంధాలు రచించాడు. ఇతని పెక్కు చాటువులు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత్పర్యం.
ఇతడు రచించిన శ్రీ మహాలక్ష్మీ పరిణయం కావ్యం లోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.

క్షీర సముద్రుడు తన కుమార్తె వివాహానికి రమ్మని తనకు కాబోయే అల్లుడయిన
శ్రీమహావిష్ణువుకి ఆహ్వానం పంపుతూ శుభలేఖలో ఇలా వ్రాస్తాడు.
సీ:-మత్స్య స్వరూపక! మనుజ కంఠీరవ! పురుషోత్తమ! త్రిశూల ధర ధనుర్వి
భంగ! కాకాసుర భంజన! విశ్వాత్మ! వామన! హరి! మురవైరి! నరక
శిక్ష! కుచేల సమ్రక్షక! సర్వజ్ఞ ! హరిహయనుత! చక్ర హస్త! రఘుకు
లాధిప! సర్వంసహాధీశ! మేఘ సన్నిభ గాత్ర! తపనాబ్జ నేత్ర! మునిజ
గీ:-నాభి వందిత! గాధేయ యజ్ఞ పాల! రావణాంతక! శ్రీ యాది దేవ! యనుచు
బ్రతి పద ప్రథమాక్షర పంక్తి సంజ్ఞ తెలియగా వ్రాసె.శుభ లేఖ జలధి విభుడు.
తాత్పర్యం సుబోధకమేగదా!
" మమ పుత్రికా వివాహమునకు సహచర సమేతముగా రా శ్రేయాదిదేవా! "
ఎంత చమత్కారంగా శుభలేఖ వ్రాయించాడో కవి చూచారా! ఇతని కావ్యాలన్నీకూడా చమత్కారాల సమాహారంగా చెప్పవచ్చు. సమయం చిక్కినప్పుడు మరో పద్యం గ్రహిచుదాం.
నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
పద్య విపంచి.

Tuesday, September 9, 2008

వినాయక వర్ణన

సర స్వతీ నమస్తుభ్యం.
సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు పెక్కురున్నారు. ఆంద్ర భాషామతల్లి సేవలోపునీతులవుతున్నారు.
వారిని చుసి మనం ఉప్పంగిపోతాం. మనకీ అనిపిస్తుంది వారిలాగా మాతాదాలనీ, వారిలాగా పద్యాలు వ్రాయాలని. .
" సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్న వేమన పలుకు మనకి తెలియంది కాదు.ఐతే ప్రయత్నం చేయకుండా ఏదీ సాధ్యం కాదు. మనమూ ప్రయత్నిద్దాం.
ముందుగా కొన్ని అనుసరణీయాంశాలు. :-మనకి గద్యనయినా పద్యాన్నయినా అర్థస్ఫురణ కలిగేటట్టు చదువ గలగాలి.
ఆతరువాత సాధ్యమయినన్ని ఎక్కువ పద్యాలు చదవాలి. ఛందస్సులో వ్రాయాలనుకుంటే ఛందస్సులో గల పద్యాలు చదివినట్లయితే ఛందస్సులో సులభంగా వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.
నేటి మీ ప్రయత్నానికి నాన్డి పలుకుతారా ! ఐతే వినాయక నవరాత్రులు సందర్భంగా మనం వినాయకుని వర్ణిస్తూ మీకు వచ్చిన ఛందంలో వ్రాసి పోస్టు చేయండి.. ఎదురుచూడనామరి?
నేటి విషయం వినాయక వర్ణన నిర్విఘ్నమస్తు.
చింతా రామ కృష్ణా రావు. .
నమస్తే. రాబోతున్న 21-9-2008 వ తేదీనే గురజాడ జయంతి.ఈ జయంతి సందర్భంగా అతని జన్మ స్థలమైన సర్వసిద్ధిరాయవారంలో అతని జయన్తివేడుకలు జరుపుతున్నాం. ఆ ప్రజా కవి స్ఫూర్తితో మనం కూడా మన రచనలతో గురజాడ అడుగు జాడలలో నడిచే వారికి ప్రోత్సాహాన్నిద్దాం. " ఆధునిక కవితా వైతాళికుడు " మన గురజాడ.
ప్రాచీన సంప్రదాయానువర్తులు గేయాల్ని సంప్రదాయవిరుద్ధ రచనలుగా గణించి ఆదరిమ్పకున్దురుగాక. యదార్థానికి ప్రాచీన గ్రంధస్థ భాష పంచదార పానకంలాగా పరిమిత ప్రయోజనం కలది. వాడుక భాష మంచినీరులాగా బహుళ ప్రయోజనం కలది.ఈ సత్యాన్ని గ్రహించారు కాబట్టే గిడుగు, గురజాడ మున్నగువారు వ్యావహారిక భాషా ఉద్యమానికి నడుం కట్టారు.కృతకృత్యులయ్యారు. అలాగని వారు ఛందో బాహ్యంగా కవితలు చేసారనుకోవడం సరికాదేమో. గురజాడ గేయాలలో మాత్రా ఛందస్సు గోచరిస్తుంది. " దేశమును ప్రేమించుమన్నా.....మంచి అన్నది పెంచుమన్నా...... వట్టి మాటలు కట్టిపెట్టోయ్....... గట్టి మేల్ తలపెట్టవోయ్. ఇది పరిశీలిస్తే లయ బద్ధమయిన మాత్రా బద్ధత కనిపిస్తుంది. ఇది ఛందో బద్ధం కాదని యెలాగనగలమ్?దీనిని సంప్రదాయచందాల్లో " మత్తకోకిల " తో తైపారువేసి చూసుకోవచ్చు. .......
మత్త :-పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక రోళ్ళు పీటల నొక్క ప్రోవిడి యెక్కి చే
పెట్టజాలక కుండక్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడ పాలు చేరల పట్టి ద్రావె తలోదరీ. ....................ఇది భాగవతం లోని పద్యం. ...కొంచం పరిశీలించి చుడండి. అంట వరకు ఎందుకు. ఛందో నిబద్దం కాని లేదా మాత్రానిబద్ధం కాని కవితలు ప్రజల నాల్కలమీద నర్తన ఏ రకంగా చేయగలవు? అంటే వాడుక భాషోద్యమం ఛందస్సుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని, వాడుక భాషను బహుళ ప్రయోజనాన్ని ఆశించి నడిపిన ఉద్యమమని అనుకో వచ్చునేమో. .........అటు ప్రాచీనులకు విరుద్ధం కాని, ఇటు వ్యావహారిక విరుద్ధం కాని విధంగా వ్యవహారిక ఛందో బద్ధ కవిత్వం సముచితమనిపిస్తోంది. మరి మీరేమంటారు?
గురజాడ రచనల స్ఫూర్తితో వెలువడే మీ రచనలకై నేనెదురు చూడనా?మళ్ళీ కలుసుకొందాం. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
ఆంధ్రామృతం.

Wednesday, August 27, 2008

యువతరంగం (ద్విమాసికపత్రిక)ప్రభుత్వ డిగ్రీ కాళాశాల, చూడవరం విశాఖ patnam


ప్రియ
ఆంద్ర,భారతీయ సోదరసోడరీమణులారా! మీ అందరినీ ఈ విధంగా కలవగలగడం నాకెన్తో సంతోషం కలిగిస్తోన్ది. ముందుగా మీ అన్దరికీ నా వందనములు.
విశాఖపట్నం disrtict చోడవరం గ్రామంలో ఉండే నా పేరు"చింతా రామ కృష్ణా రావు" నేనుఇక్కడ ప్రభుత్వ Digree కళాశాలలో వుపన్యాసకునిగా పని చీసి, ఈ మధ్యే పదవీ విరమణ చేసికుడా ప్రస్తుతం అక్కడే పని చేస్తున్నాను. తెలుగు భాష బోధించడంలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను.యువతలోని అంతర్గత శక్తులను కవితలో వేలువరించేల అందున పద్య కవితలో వెలువరించేలా చేయాలనే నా ఆకాంక్ష కొంత వరకు ఇక్కడ నాకు తీరినా, ఆంధ్రుడైన ప్రతీవాడు పద్యంలో తన భావం చెప్పా గలగలనే నా కోరిక ఈ బ్లాగ్ ద్వార చాల సులభ
సాధ్యం అని నేను నమ్ముతున్నాను. నాలాగే మీరు వుత్సహవంతులై వుంటారు. కాబట్టి మీరు కుడా ప్రయత్నం చేసేలగుంటే తప్పకుండ మీచేత కూడా పద్యాల్లో మాతడే ల చెయ్య గలనని నాకు నమ్మకం వుండి.
చ:-అసదృశమైన
భాషయన ఆన్ధ్రమె చెప్పగనొప్పు ముందుగన్,
పస గలయట్టిపద్యములు భావ ప్రపూర్ణ సు బోధకంబుగా
దెసలను మారు మ్రోగగను, తీయగ వ్రాసి పఠింప నేర్పెదన్.
కసరక నాదు యత్నమును గాంచి రహింపుడు నన్ను జేరుచున్.

గమనించారుకదా! సహృదయులైన మీరు మీ అభిప్రాయాలను తెలిపి నన్ను ప్రోత్సహిన్చ గలరని ఆశిస్తున్నాను.
మళ్ళీ కలుసుకుందాం సద్ గుణ "గణా"లను పంచుకుందాం.