Monday, January 21, 2013

Latest Income tax slabs for year 2012-2013


Latest Income tax slabs for year 2012-2013

Submitted by financeminister on Fri, 03/16/2012 - 14:27
The latest income tax slab to calculate your tax for Year 2012-2013 based on budget 2012 budget.
Tax exemption limit raised to Rs 2 lakhs and tax rates has changed for other slabs too.
Use our Free income tax calculator for getting an idea of how much tax you will be saving compared to last year per the latest tax rates.

India Income tax slabs 2012-2013 for General tax payers

Income tax slab (in Rs.)Tax
0 to 2,00,000No tax
2,00,001 to 5,00,00010%
5,00,001 to 10,00,00020%
Above 10,00,00030%

India Income tax slabs 2012-2013 for Female tax payers

Income tax slab (in Rs.)Tax
0 to 2,00,000No tax
2,00,001 to 5,00,00010%
5,00,001 to 10,00,00020%
Above 10,00,00030%

India Income tax slabs 2012-2013 for Senior citizens (Aged 60 years but less than 80 years)

Income tax slab (in Rs.)Tax
0 to 2,50,000No tax
2,50,001 to 5,00,00010%
5,00,001 to 10,00,00020%
Above 10,00,00030%

India Income tax slabs 2012-2013 for very senior citizens (Aged 80 and above)

Income tax slab (in Rs.)Tax
0 to 5,00,000No tax
5,00,001 to 10,00,00020%
Above 10,00,00030%

Sunday, January 13, 2013

శ్రీ నందన నామ సంవత్సర మకర సంక్రాంతి సందర్భముగా పాఠకులకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
పాఠక పుంగవులారా! శ్రీ నందన నామ సంవత్సర మకర సంక్రాంతి సందర్భముగా మీకు మీ పరివారమునకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి శుభ వేళ మధురమైన
భావ జాలంబు రూపమై ప్రబలఁ జేసి,
మీకు సంతృప్తి నొసగుత. మేలు గొల్పి.
ప్రణవ నాదస్వరూపులౌ భవ్యులార!
జైహింద్.

Friday, January 11, 2013

ఓ భారతీయ యువజనులారా! సంఘటితం కండి.కార్యోన్ముఖులవండి


జైశ్రీరామ్
సోదర భారతీయులారా! ఈ రోజు స్వామీ వివేకానంద 150 వ జయంతి. ప్రతీ సంవత్సరము ఈ తేదీన యువ జన దినోత్సవము జరుపుకొనుచున్న విషయము మీకు తెలియనిది కాదు. దానికి కారణము యువకుడైన మన వివేకానంద మన భారతాంబ కీర్తి పతాకను ప్రపంచం అంతటా ఎగురవేశాడు.ఆత్మ నిగ్రహము, జ్ఞాన దీప్తి, అకుంఠిత దీక్ష అనే సద్గుణాలే వివేకానందుని ప్రపంచంలో స్వామీ వివేకానందగా తీర్చిదిద్దాయి.
ఈరోజునే యువ జన దినోత్సవము జరుపుకొనుటలో గల అసలు సత్యమేమిటంటే యువ భారతీయులు యావన్మందీ తర తమ భేదాలు వీడి, కులాతీతముగా, మతాతీతముగా, సత్యమార్గైకవర్తులై మన అమ్మ భారతిని
తమ సత్ప్రవర్తనతో సంతోష పరచాలని. ప్రపంచ దేశాలను మన భారతమ్మ కీర్తిచంద్రికల చలువదనంతో నింపాలని ఆశించేనండి.
ఈనాడు ఈ చీకాకుల చీకటులు అలముకొనటానికి, అశాంతి పెరగటాబికి, దుర్మార్గము పెచ్చురేగటానికి కారణం కేవలం కరడు కట్టుకుపోయిన స్వార్థం. దుష్టమైన మత మౌడ్యం. అర్థ రహితమైన ఆలోచనా సరళి. అన్నిటికీ మించి అవివేకము.
జ్ఞాన దృష్టి కలిగి అవివేకాన్ని పారద్రోల గలిగితే మిగిలేది వివేకమే. దానితో ఆనందుడౌతాడు మానవుడు అప్పుడు వివేకానండే కదా? 
ఈ అనంత దౌర్భాగ్య స్థితి గతులను అలవోకగా మార్చ గలిగే మహా శక్తి యువతయే. ఇది యువతకు తప్ప మరెవరికీ సాధ్యము కాదు.
భారతీయ యువజనులారా! స్పందించండి. మన వివేకానందుని ఆదర్శ భావాలను స్వీకరించి, త్రికరణ శుద్ధిగా అనుసరించి, మీరేమిటో నిరూపించుకోండి. ఈ భారాతాంబ మీ వంటి యువ యోధుల సేవ కొఱకై తపిస్తోంది. స్వార్థపరుల కబంద హస్తాలలో నలిగిపోతున్న తన నిరు పేద ప్రజానీకాన్ని, వారి కష్టాలను కడగళ్ళను చూడలేక విలవిలలాడిపోతోంది. మీరే సమర్థులు. మీకే సాధ్యం మన భారతదేశమునకు దుష్టచరితులవలన కలిగిన కళంకమును కడిగివేయటానికి. మీ యువశక్తే మీకు అండ. ఏ పెద్దలు మీకు అక్కర లేదు. మీ సమర్థతే మీ గురువు. నిష్కల్మష హృదయంతో, నిస్వార్థ తత్వంతో, నిరుపమాన సేవా దృక్పథంతో మన భారతిని స్వర్ణ భారతిగా మార్చటానికి, నేటి బాలురకు రేపటికి బంగారు బాట వేయటానికి నడుం బిగించండి. చేయీ చేయీ కలపండి. యువకులంతా ఒక్కటి కండి. ఆడా మగా తేడ లేకుండా పరస్పర భావ సమైక్యం కలిగి, ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసుకొంటూ, ప్రగతి మార్గంలో ముందుకు నడవడం ద్వారా నేటి బాలురకు బంగారు భవితను ఏర్పాటు చేయండి. నేటి స్వార్థపరుల కుత్సిత రాజకీయాలనుండి మన ప్రజానీకం యొక్క భవితను కాపాడండి. తలచుకుంటే మీరు చేయలేనిది లేదని మీరు గ్రహించండి. మీ ఆలోచనలకు పదును పెట్టండి. 
బద్ధకం అన్ని దరిద్రాలకు మూలం. అన్ని అభివృద్ధులకు నిరోధకం. అటువంటి బద్ధకాన్ని మీ దరి చేరనీయకండి. ఒక్క క్షణం గడిచిపోయిందా అది వెనుకకింక రాదు. కాలం చాలా విలువైనది. విలువైన సమయాన్ని పొదుపుగా వాడండి. ఎప్పుడు పూర్తి చేయవలసిన పని అప్పుడు పూర్తి చెయ్యండి. ఇవన్నీ మీకు మీరే సాధించ గలిగినవి. కేవలం మిమ్మల్ని మీరు జయించ కలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్రపంచాన్ని మీరు జయించాలంటే ముందు మిమ్మల్ని మీరు జయించ గలగాలి. ఇంద్రియ లోలురు కాకూడదు. అర్థ రహితమైన తాత్కాలిక అశాశ్విత ఇంద్రియ సౌక్యము కొఱకై అపురూపమై నీ ఆశయాన్ని విడనాడటం మూఢత్వమే ఔతుందని మరువకండి.
విజయోస్తు. యువశక్తి యొక్క అనంత సద్భావనా గరిమ ఇటుపై యావద్భారత జాతికీ ఉషోదయం కావాలి. బంగారు భవితను ఏర్పరచ గలగాలి. జీవితముపై ఆసక్తిని, అపురూపమైన ఆనందాన్ని ఇవ్వ గలగాలి.
మీ అందరికీ ఇవే ఇవే ఇవే నా హృదయ పూర్వకమైన శుభాభినందనలు. దీర్ఘాయుష్మంతులై ఆశయ సాధనలో విజయ పథ గాము లగుదురు గాక. పరమాత్మ మీ వెంట నుండును గాక.
శుభం
జైహింద్.

Monday, January 7, 2013

సంస్కృత కళాశాలలకు పట్టిన ఈ దుస్థితిని మాపండి. విద్యార్థినుల విజ్ఞప్తి


జైశ్రీరామ్.
శ్రీమదాంద్రభాషాభూషణులైన సహోదరీ సహోదరులారా! ఆంధ్రభాషామతల్లి వేడుకోలును (సదనం) విద్యార్థినుల విజ్ఞప్తిలో తిలకించండి.
ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల(సదనం)
రాజమహేంద్రవరము.
విజ్ఞప్తి.
రాష్ట్రంలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహోత్సవాల సమావేశాలలో అనేక మంది కవులు పండితులు వక్తలు, ప్రజా ప్రతినిధులు తెలుగును మరచిపో కూడదని, తెలుగు భాషను బ్రతికించుకోవాలని, అది మన మాతృ భాష అని, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, బోర్డులన్నీ తెలుగులోనే వ్రాయాలనీ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.ఇది చాలా సంతోషించ తగ్గ విషయము. ఐతే తెలుగు భాష నేర్చుకొనుటకు ఆయువుపట్టైన ప్రాచ్య కళాశాలల(ఓరియంటల్ కాలేజస్)పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో దక్షిణ కాశీగా పిలవబడే రాజమహేంద్రవరము పట్టణ నడిబొడ్డున పవిత్ర గోదావరీ తీరమున"ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల" క్రీ.శ.1931లో స్థాపించబడి, కుల మత వర్గ విచక్షణ లేకుండా బాలికలను చేర్చుకొని,తెలుగు సంస్కృత సంప్రదాయ భాషా బోధన గావించుచు, అప్పటి నుండి ఇప్పటి(2012)వరకు నిరాటంకంగా నిరంతర వాహిని గోదావరిలా కొనసాగుతూ, అనేకమంది విద్యార్థినులను ఉద్దండ పండితులుగా, అవధానులుగా తీర్చి దిద్ది, తెలుగు సంస్కృత సొగసుల గుబాళింపును, భాషా వికాసమును నలు దెసలా ప్రజ్వరిల్ల జేసిన యీ కళాశాల ఈ నాడు ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గిరియై, రేపో మాపో కళాశాల మూతపడే ప్రమాదమేర్పడినది. ఎందు చేతననగా ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తరువు సంఖ్య.35 ప్రకారము పదవీ విరమణ చేసిన ఖాళీలలో క్రొత్తవారిని నియమించక పోవుటయే. అందు వలన అధ్యాపకులు లేక బోధన కుంటువడు చున్నది.తత్ఫలితముగా కళాశాల మూతపడే ప్రమాదమేర్పడినది. అందువలన  తెలుగు, సంస్కృత భాషలు కనుమఱుగయ్యే ప్రమాదమున్నది.
ఒకప్పుడు భాషాప్రవీణగా, సాహిత్య విద్యాప్రవీణగా పిలువబడే ఈ చదువును పెఅస్తుతము B.A.O.L. DEGREE గా పిలుస్తారు.తెలుగు భాషాశాస్త్ర, వ్యాకరణ, అలంకార, కావ్యాదులను క్షుణ్ణంగా బోధిస్తారు.తెలుగు భాషా గౌరవమునకు ఆయువుపట్టైన అవధాన ప్రక్రియ కుంటుపడుతున్న ఈ రోజులలో మహిళలు అవధాన ప్రక్రియలో రాణిస్తూ, పెద్దపెద్ద నగరాలలో ప్రదర్శనలిస్తూ, అవధాన సౌరభాన్ని అంతటా వ్యాపింప చేస్తూ, పేరు ప్రఖ్యాతులు గైకొంటున్న మహిళా అవధానులకు ఆట పట్టు ఈ కళాశాల. నేడు కూడా SV channel మా విద్యార్తినుల అవధానములను ప్రసారం చేయుచున్న విషయము ప్రేక్షకులకు సువిదితమే.
శ్రీ నాళం రామలింగయ్య గారి ఆర్ధిక సహాయం, గౌరవనీయులైన బత్తుల కామాక్షమ్మ గారి సేవా దృక్పథంతో వృద్ధి చెందిన యీ కళా శాలలో పదవీ విరమణ చేసిన వారి స్థానములు ప్రభుత్వ ఉత్తరువు 35 కారణముగా ఖాళీగా ఉంచివేసిన కారణముగా  బోధన కరువైనది. దాతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ధార్మిక సంస్థలు సహకరిస్తూ అతి కష్టం మీద ఇప్పుడు ఈ కళా శాలలో బోధన సాగుచున్నది. సిబ్బందిని నియమింప వలసినదిగా ప్రభుత్వమునకు ఎన్ని పర్యాయములు విన్నవించుకున్నను, అరణ్య రోదనయే అగుచున్నది.
తెలుగు మహా సభలలో ఉపన్యసించు కవులు, వక్తలు, పండితులు, ప్రజా ప్రతినిధులు, తెలుగు భాషాధ్యయనమునకాటపట్టైన సంస్కృత కళాశాలలు మూత పడకుండా ఉండుటకై ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చి, సిబ్బంది నియామకము జరిగేలా చూడవలసిన అవసరమెంతైనా ఉంది. మన భాషా సంస్కృతీ సంప్రదాయాలను తరువాత తరముల వారికి అంద జేయ వలసిన కనీస ధర్మము అందరిపైనా ఉందని విన్నవించుకొనుచున్నాము. మీరూ ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించి మా విన్నపము యొక్క పరమార్థము నెరవేరే మార్గంలో కృషి చేసి తెలుగు భాషామతల్లిని రక్షిస్తారని ఆశిస్తున్నాము.
ఇట్లు
కళాశాల కమిటీ, మరియు విద్యార్థినులు.
చూచారు కదండి. మీ పరిధిలో ఏమి చేయగలరో అది చేస్తారనే విశ్వాసం నాకు ఉంది. మీ బ్లాగులద్వారా పదిమందిదృష్టికీ ఈ దుస్థితిని తీసుకురండి. ప్రభుత్వం నుండి సానుకూల స్పందనను సాధించండి. ఈ విషయంలో మీ సహాయ సహకారాలందించనున్న మీ అందరికీ నా కైమోడ్పులు.
జైహింద్.

Tuesday, January 1, 2013

ప్రపంచ తెలుగు మహా సభలు అత్యద్భుతంగా జరిగాయి. అందరికీ శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
సహృదయ సన్మిత్రులారా! ఆ పరమాత్మ ఎల్ల వేళలా సజ్జనులైనమీకు, మీ వంటి వారికందరికీ అండగా ఉండి, నిరాఘాట సత్ప్రయత్నసాఫల్యత ప్రాప్తింప చేయు గాక. అందరికీ శుభాకాంక్షలు
మీ అందరి అభినందనలతో తే.29-12-2012  మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో నిర్వహించిన 4వ ప్రపంచ తెలుగు మహా సభ - సాహిత్య ఉప వేదికపై " చమత్కారములు - చాటువులు " అనే అంశముపై నేను ప్రసంగించాను. మన సాహితీ మిత్రులు అనేక మంది శ్రమతీసుకొని ప్రత్యేకించి వచ్చి, అన్ను అభినందించి వేదికకు పంపించటం నాకెంతో సంతోషం కలిగించింది.వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ్ జేసుకొనుచిన్నాను. ఛాయా చిత్రములు కూడా ఆ విధంగా వచ్చిన ‘భాగవత గణనాధ్యాయి’ శ్రీ సాంబశివ రావు గారు తీసి నాకు పంపి యున్నారు. వారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఛాయా చిత్రములను జతచేస్తున్నాను.
జైహింద్.

Monday, December 24, 2012

ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనే సదవకాశం.

జైశ్రీరామ్.
సహృదయ భారాతీయ సహోదరులారా! ఆ జగన్మాత కటాఖ్శం వల్ల, మీ వంటి సన్మిర్తుల శుభాకాంక్షలవల్లా, "తిరుపతిలో జరుగుచున్న ప్రపంచ తెలుగు మహా సభలలో దిగ్దంతులవంటి తెలుగు సరస్వతీ, పుంభావ సరస్వతీ మూర్తులను చూచే భాగ్యంతో పాటు, అక్కడ వేదికపై ఉపన్యసించే సదవకాశం కూడా నాకు లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి నన్ను ఉపవేదికపై ఉపన్యసించ వలసినదిగా కోరుతూ ఆహ్వానం వచ్చింది.
ఈ సదవకాశం కలిగించిన ప్రభుత్వానికి నా ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను. 
అక్కడికి వస్తున్న మీ అందరిమీ ప్రత్యక్షంగా చూచే అదృష్టం నాకు కలుగుతున్నందులకు ఆనందంగా ఉంది.
జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః.
జైహింద్.