Tuesday, January 1, 2013

ప్రపంచ తెలుగు మహా సభలు అత్యద్భుతంగా జరిగాయి. అందరికీ శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
సహృదయ సన్మిత్రులారా! ఆ పరమాత్మ ఎల్ల వేళలా సజ్జనులైనమీకు, మీ వంటి వారికందరికీ అండగా ఉండి, నిరాఘాట సత్ప్రయత్నసాఫల్యత ప్రాప్తింప చేయు గాక. అందరికీ శుభాకాంక్షలు
మీ అందరి అభినందనలతో తే.29-12-2012  మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో నిర్వహించిన 4వ ప్రపంచ తెలుగు మహా సభ - సాహిత్య ఉప వేదికపై " చమత్కారములు - చాటువులు " అనే అంశముపై నేను ప్రసంగించాను. మన సాహితీ మిత్రులు అనేక మంది శ్రమతీసుకొని ప్రత్యేకించి వచ్చి, అన్ను అభినందించి వేదికకు పంపించటం నాకెంతో సంతోషం కలిగించింది.వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ్ జేసుకొనుచిన్నాను. ఛాయా చిత్రములు కూడా ఆ విధంగా వచ్చిన ‘భాగవత గణనాధ్యాయి’ శ్రీ సాంబశివ రావు గారు తీసి నాకు పంపి యున్నారు. వారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఛాయా చిత్రములను జతచేస్తున్నాను.
జైహింద్.

No comments: