Tuesday, November 6, 2012

తిరుమలేశుని తన హరికథా గానంతో ఓలలాడించిన హరికథా భాగవతార్ బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ ఈ నెల 2౦ వ తేదీన మన హైదరాబాదు వస్తున్నారు.

జైశ్రీరామ్.
భగవద్భక్తులారా! మొన్న గడిచిన తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో మూడు రోజుల పాటు తన హరి కథా గానంతో  జనాన్ని భక్తి పారవ్శ్యంలో ముంచెత్తి, ఆ వేంకటేశ్వర స్వామి వారికి సహితం ఆనంద పారవశ్యం కలిగించిన బ్రహ్మశ్రీ మంగిపూడి వేంకట రమణ మూర్తి భాగవతార్ (బొబ్బిలి)  మన భాగ్యనగరం తే.20 ని వస్తున్నారు. 23వ తేదీన వారి హరికథ ఉన్నది. 
20, 21, 22 తేదీలలో వారు మన భాగ్యనగరంలోనే ఉంటున్నందున ఎవరయినా వీరి హరికథా కార్యక్రమం పెట్టదలచుకొంటే ఇది ఒక మంచి అవకాశం.
23 వతేదీన పుట్టపర్తి సాయిబాబా వారి జయంతి సందర్భంగా 19 వతేదీ నుండి23వ తేదీ వరకు భక్తి కార్యక్రమాలు సాయి భక్తులు నిర్వహించుట పరిపాటి. అందుచే్ ఈ అవకాశం కోసం ఎదురు చూచేవారుంటారని భావించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
వారిని సంప్రదించ దలచుకొన్నవారి కొఱకు వారి సెల్ నెంబరు తెలియ జేస్తున్నాను.
వారి సెల్ నెంబరు 9014992816.
జైహింద్.

No comments: