జగజ్జననీ! వాక్కులను సృజించు వారు, చంద్రకాంతమణుల శకలముల వలె తెల్లనైన దేహముల కాంతికలవారు అగు – వశినీ మొదలగు శక్తులతో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించునో వాడు – మహాకవులైన వాల్మీకి కాళిదాసాదుల కవిత్వరచన వలె మధురమైన, శ్రవణరమణీయమైన, సరస్వతీ దేవి యొక్క ముఖ కమల పరిమళములను వెదజల్లు మృదువైన వాక్కులతో – రసవంతమైన కావ్య రచన చేయగల సమర్థుఁడగును.
జగజ్జననీ! ఉదయించుచున్న బాల సూర్యుని అరుణారుణ కాంతి సౌభాగ్యమును పోలిన నీ దివ్యదేహపు కాంతులలో- ఈ సమస్తమైన ఆకాశము, భూమి మునిగి ఉన్నట్లు భావించి ధ్యానించే సాధకునికి- బెదురు చూపులతో ఉండు లేడి వంటి కన్నులు కలిగిన దేవలోక అప్సర స్త్రీలు ఊర్వశితో సహా వశులవుతారు.
ఓ మాతా! నీ మోమును బిందువుగా జేసి, దానిక్రిందుగా కుచయుగమునుంచి, దాని క్రిందుగా త్రికోణముంచి నీమన్మథకళ నెవడు ధ్యానిస్తాడో, ఆ ధ్యాన ఫలితంగా కామాసక్తులైన వనితలను కలవరపెడుతున్నాడు. అంతే కాదు ఆ సాధకుడు సూర్య చంద్రులను స్తనములుగా కలిగిన త్రిలోకములను మోహమునకు గురిచేయుచున్నాడు.
తత్త్వమ్ముతోఁ గూడి తనరు నీ వాసమౌ శ్రీచక్రమందలి చెలగు కోణ
ములనష్టదళముల నలపద్మషోడశమును మేఖలాతంత్రముగను, మూడు
తే.గీ. భూపురములును కలిసిన మొత్తమటుల
నలుబదియు నాలుగంచులు కలిగి యుండె
నమ్మ నీవాసమపురూపమైనదమ్మ!
నెమ్మి నిన్ను నేఁ బూజింతునమ్మ నమ్మి. ॥ 11 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి = ఓ జననీ!)
చతుర్భిః = నలుగురైన,
శ్రీ కంఠైః = శివులచేతను,
శంభోః = శివుని కంటె
ప్రభిన్నాభిః = వేరైన,
పంచభిః అపి = ఐదుగురైన,
శివయువతిభిః= శివశక్తుల చేతను,
నవభిః = తొమ్మిదిఐన,
మూల ప్రకృతిభిః అపి = మూల కారణముల చేతను,
తవ = నీ యొక్క,
శరణ = నిలయమగు శ్రీ చక్రము యొక్క,
కోణాః = కోణములు,
వసుదల = ఎనిమిది దళముల చేతను,
కలాశ్ర = పదునాఱు దళముల చేతను,
త్రివలయ = మూడు మేఖలల (వర్తుల రేఖల) చేతను,
త్రిరేఖాభిఃసార్ధమ్ = మూడు భూపుర రేఖల చేతను,
పరిణతాః = పరిణామమును పొందినవై,
చతుశ్చత్వారింశత్ = నలుబది నాలుగు అగుచున్నవి.
భావము.
తల్లీ! నాలుగు శివకోణములు, తద్భిన్నములైన అయిదు శక్తికోణములు, తొమ్మిది మూల ప్రకృతులతోనూ, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, మేఖలాత్రయము, భూపురత్రయములతో నీవుండే శ్రీచక్రము 44 త్రికోణములతో అలరారుచున్నది.
అమ్మా! బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవీంద్రులు కూడా ఎంత ప్రయత్నించినా నీ దేహ సౌందర్యముకు సాటి చెప్పలేకపోతున్నారు. దేవతా స్త్రీలు, అప్సరసలు నీ సౌందర్యము చూచుటకు కుతూహలము కలవారై, నీ అందముతో సాటిరాని వారై, కఠిన తపస్సులచే కూడా పొందలేని శివసాయుజ్యమును మనస్సుచే పొందుతున్నారు.
తల్లీ! నీ క్రీగంటి చూపుపడిన మానవుడు, అతడు కురూపియైనా, ముదుసలి అయినా, సరసమెరుగని వాడయినా, అలాంటి వాడిని చూసి- మహా మోహముతో కొప్పులు వీడిపోవగా, పైట చెంగులు జారిపోవగా, గజ్జెలమొలనూళ్ళు తెగిపోవగా, ప్రాయములో ఉన్న వందల కొద్దీ స్త్రీలు అతని వెంటపడతారు. అంటే అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపిని కూడా మన్మథుని వంటి అందగాడిని చేయునని భావం.
స్ఫటిక మాలను దాల్చి, సన్నుతంబుగ దివ్య పుస్తకంబును దాల్చి నిస్తులవయి
తే.గీ. యొప్పు నీకు వందనములు గొప్పగాను
జేయు సజ్జనులకునబ్బు శ్రీకరముగ
మధువు, గోక్షీర, ఫలరస మాధురులను
మించు వాగ్ధాటి భువిపైన మేల్తరముగ. ॥ 15 ॥
ప్రతిపదార్థము.
(హే భగవతి! = ఓ జననీ!)
శరత్ = శరత్కాలపు
జ్యోత్స్నా = వెన్నెలవలె,
శుద్ధామ్ = నిర్మలమైనదియు,
శశియుత = నెలవంకరేఖను కూడినదియు నయిన,
జటాజూట = జుట్టు ముడి అనెడి,
మకుటామ్ = కిరీటము గలదియు,
వర = వరద ముద్రను,
త్రాసత్రాణ = అభయముద్రయు,
స్ఫటిక ఘుటికా = స్ఫటికములతో కూర్చడిన అక్షమాలయు,
పుస్తక = పుస్తకమును,
కరామ్ = హస్తములందు గలిగినదానిగా,
త్వా = నిన్ను,
సకృత్ = ఒక్కమాఱు అయినను,
నత్వా = నమస్కరించిన,
సతామ్ = బుద్ధిమంతులకు,
మధు = తేనె,
క్షీర = పాలు,
ద్రాక్షా = ద్రాక్షా ఫలముల,
మధురిమ = తీయదనమును,
ధురీణాః = వహించి యున్న మధురాతిమధురమైన,
ఫణితయః = వాగ్విలాస వైఖరులు,
కథమివ = ఎట్లు,
న - సన్నిదధతే = ప్రాప్తించకుండా ఉండును?
భావము.
తల్లీ! శరత్కాలపు వెన్నెలవలె శుద్ధమైన తెల్లని కాంతి కలిగినట్టి, చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలిగినట్టి, వరదాభయ ముద్రలను, స్ఫటిక మాలా పుస్తకములను నాలుగు చేతులలో ధరించి ఉన్న నీకు, ఒకసారైనా నమస్కరించక సజ్జనులు, కవులు తేనె, పాలు, ద్రాక్ష పండ్లయొక్క మాధుర్యము నిండి యున్న వాక్కులను ఎలా పొందగలరు?
ఓ హిమవత్పర్వత రాజపుత్రీ! పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు ఐదు మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు-జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము. ఇలా ఏ మాత్రము సమర్ధములు కానివగు ఇట్టి సాధన సామగ్రితో కనీసము శరీరము గూడా లేనివాడైన మన్మథుడు నిన్ను ఆరాధించి, అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా!
శరత్ చంద్ర వదనా = శరదృతువు నందలి పూర్ణిమా చంద్రుని వంటి వదనము గలదియు,
కరతలైః = నాలుగు చేతులయందు,
ధనుః = విల్లును,
బాణాన్ = బాణములను,
పాశమ్ = పాశమును,
అపి = మరియు,
సృణి = అంకుశమును,
దధానా = ధరించునదియు,
పురమథితుః = త్రిపురహరుడైన శివుని యొక్క,
ఆహో పురుషికా = అహంకార స్వరూపిణి యగు జగన్మాత,
నః = మా యొక్క,
పురస్తాత్ = ఎదుట,
ఆస్తామ్ = సాక్షాత్కరించు గాక !
భావము.
చిరుసవ్వడి చేయు గజ్జెల వడ్డాణము గలది, గున్న ఏనుగు కుంభములను పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడునది, సన్నని నడుము గలది, శరదృతువు నందలి పరిపూర్ణమైన పూర్ణిమ చంద్రుని పోలే ముఖము గలది, నాలుగు చేతులయందు వరుసగా ధనుస్సు, బాణములు, పాశము, అంకుశములను ధరించి యుండునది, శివుని యొక్క శక్తి స్వరూపిణియునగు జగన్మాత మాకు ఎదురుగా సుఖాసీనురాలై సాక్షాత్కరించుగాక!
కుహరిణి = తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన,
కుల (కు = పృథివీ తత్త్వము, ల = లయము నొందు) సుషుమ్నా మూల మందలి,
కుండే = కమల కందరూపమైన చక్రము నందు,
స్వపిషి = నిద్రింతువు.
భావము.
తల్లీ! నీ పాదముల జంట యొక్క మధ్య నుండి స్రవించుచున్న అమృతము చేత పంచతత్త్వ దేహమును ప్రేరేపించు నాడీ మండలమును తడుపుచున్న దానవై, చంద్రుని నుండి స్వకీయమైన భూతత్త్వమునకు సంబంధించిన ఆధార చక్రమును మరల పొంది, సర్పమువలె అధిష్ఠింపబడిన కుండలాకారమైన దానినిగా తనదగు నిజ స్వరూపమును పొంది, తామర పూవు బొడ్డు వద్దనుండు సన్నని రంధ్రము వంటిదైన సుషుమ్నా మూల మందలి కమల కందరూపమైన చక్రము నందు నిద్రింతువు.
ఓ మంగళా! ఓ శాంభవీమాతా! నా హృదయమనెడి శ్రీచక్రమునందు వసియించు తల్లీ! నేను అల్పుఁడను. నీ కృపామృతముయొక్క తేజస్సు చేత సౌందర్యలహరిని తెలుఁగు పద్యములుగా వ్రాయుచున్నానమ్మా. నీకు నమస్కరించెదను. నీవే ప్రకాశవంతమైన వాణిగా శంకరులయొక్క ఆత్మమార్గమున ఆ శంకరులే ఆనందించు విధముగా ప్రకాశింపుము.
శ్లోకము
భుమౌస్ఖలిత పాదానాం భూమిరేవా వలంబనం |
త్వయీ జాతాపరాధానాం త్వమేవ శరణం శివే ||
తే.గీ. ధరణిఁ బడ్డ పాదములకు ధరణి తానె
చూడనాధారమమ్మరో! శోభనాంగి!
నీదు సృష్టిలో దోషులన్ నీవె కాచి
శరణమొసగంగవలెనమ్మ! శరణు శరణు.
భావము.
భూమిపై పడిన పాదములకు భూమియే ఆధారము. అటులనే నీ సృష్టిలో ఉన్న దోషులను నీవే కాపాడి శరణమొసగవలెనమ్మా! నీవే నాకు శరణు.
సౌందర్య లహరి.
శ్రీశంకరభగవత్పాదులు సమయ యను చంద్రకళను పద్యశతముచేఁ బ్రస్తుతించుచున్నారు.
హరిహరవిరించాదిభిరపి = విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేత గూడా;
ఆరాధ్యామ్ = పూజింప దగిన;
త్వామ్ = నిన్ను గూర్చి,
ప్రణంతుమ్ = నమస్కరించుటకుగాని;
స్తోతుంవా = స్తుతించుటకుగాని;
అకృత పుణ్యః = పుణ్యము చేయనివాడు;
కథమ్ = ఏ విధముగా;
ప్రభవతి = శక్తుడగును? శక్తుఁడు కాలేడమ్మా.
భావము.
శివుడు శక్తితో కూడి యున్నపుడు సృష్టించుటకు సమర్థుఁడు ఈ విధముగా కాదేని (అనగా శక్తితో కూడి ఉండనిచో), ఆ శివుడు చలించుటకు కూడా నేర్పరికాడు. ఈ కారణము వలన విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేత గూడా పూజింప దగిన నిన్ను గూర్చి నమస్కరించుటకుగాని; స్తుతించుటకుగాని; పుణ్యము చేయనివాడు ఏ విధముగా శక్తుడగును?
అమ్మా! నీ పాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి, బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్టి చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీమహావిష్ణువు ఈ లేశమాత్ర పాదధూళిని ప్రయత్నపూర్వకంగా తన వేయితలల మీద ధరించుచున్నాడు. ఈ నీ లేశమాత్ర పాదధూళినే శివుడు మెదిపి తన శరీరానికి అంగరాగంగా పూసుకొంటున్నాడు. నీపాద ధూళి మహిమచే సృష్టింపబడిన ఈ లోకాలన్నిటినీ శివుడు యుగాంతములలో బాగా మెదిపి, ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకొంటున్నాడు.
మిహిర ద్వీపనగరీ = సూర్యుడు ఉదయించు ప్రదేశమునకు చెందిన పట్టణము,
జడానామ్ = అలసులగు మంద బుద్ది గలవారికి,
చైతన్య = జ్ఞానమను
స్తబక = పుష్ప గుచ్చమునుండి వెలువడు,
మకరంద స్రుతి = తేనె ధారల యొక్క
ఝరీ = నిరంతర ప్రవాహము,
దరిద్రాణామ్ = దరిద్రుల పట్ల,
చింతామణి = చింతామణుల
గుణనికా = వరుస (పేరు)
జన్మజలధౌ = సంసార సముద్రము నందు,
నిమగ్నానామ్ = మునిగి సతమతమగు వారి పట్ల,
మురరిపు వరాహస్య = వరాహరూపుఁడగు విష్ణుమూర్తియొక్క,
దంష్ట్రా భవతి = కోరలు అగుచున్నవి.
భావము.
తల్లీ! జగజ్జననీ! నీ పాద పద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడుదయించు పట్టణము వంటిది. మంద బుద్ధి గల జడుల పట్ల జ్ఞానమను తేనెను జాలువార్చు ప్రవాహము వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి, సముద్రమున దిగబడి వున్న భూమిని పైకి ఉద్ధరించిన విష్ణుమూర్తి అవతారమైన ఆది వరాహవు కోరవంటిది.
సర్వలోకముల వారికి దిక్కైన ఓ జగజ్జననీ! ఇంద్రాది ఇతర దేవతలందరు తమ రెండు హస్తములందు వరద, అభయ ముద్రలను దాల్చుచుండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించకున్నావు. భయము నుండి రక్షించుటకు, కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు – నీ రెండు పాదములే సమర్థములై ఉన్నవి గదా! (మరి ఇంక హస్తముల అవసరము నీకేల యుండును అని భావము).
మునీనాం + అపి = మౌనముగా తపస్సు గావించు ఋషులను సహితము,
అంతః = (వారి) మనస్సు లోపల,
మోహాయ = మోహపరవశులను చేయుటకు,
ప్రభవతి హి = సమర్ధుఁడగుచున్నాడు కదా.
భావము.
నమస్కారము చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లీ! ముందు నిన్ను హరి ఆరాధించి మోహినీ రూపమును పొంది శివునికి చిత్త క్షోభను కలిగించాడు. మన్మథుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో మునులను మహామోహవశులను చేయగలిగాడు.