Tuesday, October 28, 2008

ప్రాచీన సంస్కృతి మేలిమి బంగారం. 1

ప్రాచీన సంస్కృతి మేలిమి బంగారం. 1

శ్రీమన్మహా దేవుడైన పరమాత్మ సృష్టిలో గడచిన కాలం అనంతమైనది. ఈ అనంత కాలంలో అనంత విశ్వంలో సత్ శాస్వితం. అసత్ అశాశ్వితం. ఈ సత్ స్వరూపాన్ని మన పురాణాలు ఇతిహాసాలు, వేదాలు, ఇంకా అనంతమైన గ్రంథ రాజము మన ప్రాచీన సంస్కృతి పేర తెలియ జేస్తున్నాయి. మానవ మనుగడకు ఆసూక్తులే సన్మార్గ దర్శకాలు. వాటిని మనం మననం చేసుకోవడమే కాకుండా ముందు తరాల వారికి కూడా అందించాలి. వాటిని పొడి పొడి మాటలతో చెప్పినచో అవి గాలిలో కలిసిపోతాయి. మంచి మాటలెందరో చెప్పారు. ఐనా వేమన పద్య రూపంలో నున్న నీతులు అందరి నోళ్ళలోను నానుతున్న మాట మనకు తెలియనిది కాదు. అందుకే మనం శ్లోకాల రూపంలోనూ, పద్యాల రూపంలోను కంఠస్థం చేసి అనర్గళంగా సమయానుకూలంగా ఎక్కడపడితే అక్కడ చెప్పేలాగ సాధన చేయాలి. ఇట్టి సాధన చేసేవారికుపకరిస్తుందనే ఆశతో కొన్నైనా మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.ఈ ప్రయత్నం సహృదయుల మన్ననను తప్పక పొంద గలుగుతుందనుకొంటున్నాను. ఇక విషయానికి వెళ్దాము.
శ్లోకః :-ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----మహాభారతం.--అరణ్య పర్వం---29 వ శ్లోకం.
గీ:-
పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా! య
ని యను దినము ప్రశ్నంచుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.

1 comment:

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు.
నిజమె ఇలా ఎవరికి వారు తమని తాము ప్రశ్నించుకుని మనగలిగితె కొన్నాళ్ళకైనా భూతల స్వర్గమె అవుతుంది. కానీ త్రిశంకు స్వర్గంలొ కొట్టు మిట్టాడుతున్న ప్రజలు ఇలాంటి ఆణి ముత్యాలను కనీసం చదివే తీరికా ఓపికా ఉన్నాయంటారా ? ఏ ఒక్కరైనా గ్రహించక పోతారా అన్న అభిమానంతొ తెలియ జెప్పడం విజ్ఞుల లక్షణం.మీ కృషికి ధన్య వాదములు.