Friday, February 3, 2012

మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.

జైశ్రీరామ్.
సాహితీ బంధువులారా!
శ్రీ కట్టమూరి చంద్రశేఖరం అవధానిచే తే.12 - 02 - 2012 న  జయప్రకాశ్ నారాయణ్‌నగర్‌
( హైదరాబాద్. మియాపూర్ ) లో  అష్టావధానం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.
మీరు తప్పక రాగలరని ఆశిస్తున్నాను. వచ్చే అవకాశం ఉన్న వారు మీ వివరాలను నాకు తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను. సందర్భానుసారం మనలో ఎవరినయినా పృచ్ఛకులుగా అక్కడ గ్రహించే అవకాశం కూడా ఉండ వచ్చునని భావిస్తున్నాను. పాల్గొనే ఉత్సాహవంతులు తాము నిర్వహించగల అనుభవమున్న అంశాన్ని కూడా నాకు తెలియ జేయ మనవి.ఇది కేవలం మన ప్రాతినిధ్యాన్ని అక్కడ బలపరచడానికి నేను ప్రయత్నించడానికి మాత్రమే. అవకాశం కలగడమన్నది అక్కడ నిర్వాహకుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
కార్యక్రమం ఖరారు కాగానే మళ్ళీ మీ అందరికీ తెలియ జేయ గలను.     
జైహింద్. 

No comments: