Sunday, July 3, 2011

వల్లభ వఝల వారి అవ్యాజానురాగం.

ఆంధ్రామృతాన్ని అవలొకిస్తున్న శ్రీమాన్ వల్లభవఝల నరసింహ మూర్తి గారు.
ఈ రోజెంతో సుదినం.
సహృదయులు శ్రీమాన్ వల్లభ వఝల నరసింహ మూర్తి కవిగారు మియాపూర్ లో మాయింతికి వచ్చి మమ్ములనాశీర్వదించారు.( ఫొటోలో  వెనుకనున్నది వారి జ్యేష్ట పుత్రుఁడు శేషగిరి )
వారెంతో శ్రమ దమాదులకోర్చి మాయింటికి రావడం నిజంగా మా అదృష్టం గా భావిస్తున్నాను.
వీరు ప్రఖ్యాత జ్యోతిశ్శాస్త్రవేత్తే కాదు. కవి కూడాను.
వీరు అనేకమైన బంధకవిత్వాలను ఆంధ్రామృతం ద్వారా అవగాహన చేసుకొని, అద్భుతంగా వ్రాసి మన ఆంధ్రామృతంలోనే ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.
వారి అవ్యాజ కరుణానురాగాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

No comments: